గుమ్మడికాయలు | telugu boothu stories

వేసవి వస్తోందంటేనే రెండు మూడేళ్ళనుంచి జనానికొకరకమైన బెంగ పట్టుకొంటొంది. పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకి మంచినీళ్ళ చెరువులూ, నూతులూ ఎండిపోతాయేమోనన్న బెంగా. పట్టణాల్లో ఉండేవాళ్ళకి పైపులు సరిగ్గా పడవేమోనన్న బెంగా ఎప్పుడూ వుంది. మరి ఈ కొత్త బెంగ ఏమిటయ్యా అంటే- కరెంటు కొరతకు సంబందించిన బెంగ.
దీనివల్ల పల్లెటూళ్ళు ఎలా ఎఫక్టవుతున్నాయోగాని పట్టణాలకైతే పగటిపూట కనీసం నాలుగ్గంటలూ రాత్రిపూట రెండుగంటలూ పూర్తిగా సప్లై నిలిపివేయడం జరుగుతుంటుంది. ఇదిగాక, ఇన్ని యూనిట్లకి మించి కాలిస్తే డబుల్ ది రేట్ అన్న హెచ్చరిక కూడా చేయబడుతుంది.
ఎలక్ట్రిసిటీ సప్లయికి కూడా ఇటువంటి రేషన్ పెట్టడం ఎందుకు జరుగుతోంది? అని ఆలోచించి యధార్ధ పరిస్థితిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించే వాళ్ళెంతమందుంటారు? చీకట్లో దీపాలు ఆర్పివేసుకోడానికీ, ఉక్కబోస్తున్నప్పుడు ఫేన్ ఆన్ చేసుకోడానికీ కూడా లేనిపోని ఆంక్షలేమిటని ప్రభుత్వాన్ని దుయ్యబట్టే ప్రభుద్దులు మాత్రం ప్రతిచోటా కనిపిస్తారు. ఎలక్ట్రిసిటీ బోర్డుమీదనే ఈ నిందనంతా మోపేసి తమ ఉక్రోషాన్ని వెళ్ళబోసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.
ఐతే-
ఈ వేసవిలో- ఆ లొకాలిటీలో సాయంత్రం ఆరున్నర గంటలనుంచి రాత్రి ఎనిమిదింటివరకూ పవర్ కట్ జరుగుతున్నందుకు ప్రతీ శనివారం ఓ కొబ్బరికాయ కొడతానని వెంకటేశ్వరస్వామికి నిండు మనసుతో మొక్కుకున్నాడు భుజంగరావ్…!
జేబులోంచి తీసే ప్రతి పైసానూ తూచి చూసి ఖర్చు చేసే మనిషి. ప్రతి శనివారం కొబ్బరికాయ నిమిత్తం రూపాయిపైగా ఖర్చు చేయడానికి నిర్ణయించుకున్నాడంటే డెఫినిట్ గా దీనిలో ఏదో కుంభకోణముందనే అనుకోవాలి.
అదీగాక సరిగ్గా వంట వండుకొనీ భోజనాలు చేసే టైముకి దీపాలు లేకుండా పోతున్నాయని అందరూ అఘోరిస్తుంటే, అతనొక్కడూ అది పెద్ద వరంలా భావించి చంకలు కొట్టుకోవడం ఇంకా గొప్ప సర్ప్రైజు కడూ!!
భుజంగానికిప్పుడు ముప్పైయేళ్ళు ఎగ్జాట్టుఘా ఆరేళ్ళ్ క్రితం అతనికి అగ్నిసాక్షిగా పెళ్ళయింది. ఐతే ఈ విషయం మాత్రం అతనెవరికీ చెప్పడు. చెబితే, నీ పెళ్ళామేదని అవతలివాళ్ళు టక్కున అడిగేస్తారని భయం. ఆ మాటకొస్తే తనకి పెళ్లయిందన్న విషయం తనే మర్చిపోయాడేమో అనుకోవచ్చు. ఆ పెళ్ళి వ్యవహారమంతా ఇప్పుడొక పీడకలగా ఫీలవుతుంటాడు తను.
ప్రేమా, గీమా అనకుండా పెద్దవాళ్ళు ఏరికోరి కుదిర్చిన పిల్ల మెడలోనే ఎంతో సంబరంగా మూడు ముళ్ళూ వేశాడు. మరి అది ఆ ముహూర్తబలమో, తన అర్ధాంగిగా వచ్చిన అమ్మాణీ లోపమో తెలియదు. శోభనమ్నాటి రాత్రినుంచే ఆ పిల్ల అతన్ని ఎదిరించి మాట్లాడ్డం మొదలెట్టింది. కొత్త మోజుగనుక సర్ధుకుపోవడానికి ప్రయత్నించాడు. అది ఆమె అలుసుగా తీసుకుని ఇంకా మీదెక్కిపోవడం మొదలెట్టింది.
డబ్బు విషయంలో మొదట్నుంచీ అతను కొంచెం జాగ్రత్తైన మనిషి. ఆమె దానికి సుద్దవ్యతిరేకం- చూసిన సినిమాయే నాలుగుసార్లు చూడ్డం, సినిమాల్లో చూపిన చీరలూ, నగల్లంటివి తనకీ కావాలని గొంతెమ్మ కోరికలు కోరడం చేస్తుండేది. తనకొచ్చే గుమస్తా జీతంతో అవన్నీ ఎక్కడ సమకూర్చగలదు తనూ? ఆ మాత చెబితే- ఛా నీలాంటి పిసినిగొట్టు మొగుడు దొరకడం నా ఖర్మ! అని నెత్తి బాదుకొంటూ శోకండాలు పెట్టేది అది. ఆమె అమాయకత్వమో, మూర్ఖత్వమో కూడా అంతుపట్టేది కాదు భుజంగానికి. అలాగే రెండేళ్ళు నెట్టుకొచ్చాడు. ఆమె వైఖరి ఏ మాత్రం మారలేదు.
అతనిలో సహనం చచ్చిపోయింది. తన మాటము కాదన్నప్పుడల్లా చావదన్నడం ప్రారంభించాడు. వాళ్ళ గొడవ ఆలకించిన ఇరుగు పొరుగువాళ్ళు కూడా అమ్మాణీనే మందలిస్తుండేవారు. కొంతమందయితే ఆ పిల్లకి చిన్న పిచ్చి ఉందేమో! అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అది భుజంగం చెవినబడి, ఒకసారామెను డాక్టరుకి చూపిద్దామనుకునేతలో మావగారు చక్కా వచ్చాడు. మొగుడు రోజూ తాగొచ్చి తనని చితక బాదుతున్నాడని అమ్మాణీ ఉత్తరం వ్రాసిందట.
ఆ పెద్దమనిషి ముందూ వెనకా ఆలోచించకుండా వచ్చీ రావడంతోటే అల్లుడి మీద అగ్గిఫైరైపోయాడు. దాంతో భుజంగానికీ చిర్రెత్తింది. “నీకూతురు నీకు అంతగా అబ్బురమైతే, తీసుకెళ్ళి నీ ఇంట్లోనే పెట్టుకో… ఇక్కడింకేమైనా వాగావంటే ఇద్దర్నీ మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను” అని ఇంటికప్పు లేచిపోయేలా అరిచాడు. దాంతో ఆ పెద్దమనిషి మరి నోరెత్తకుండా కూతుర్ని తీసుకొని పౌరుషంగా వెళ్ళిపోయాడు.
అంతే-
ఇప్ప్పటికి మూడేళ్ళుపైనయింది. భుజంగం అక్కడికి వెళ్ళినదీ లేదు. అమ్మాణీ ఇక్కడికి వచ్చినదీ లేదూ! ఏదో విధంగా ఈ భార్యా భర్తల్ని మళ్ళీ కలుపుదామని ఇరుపక్షాల పెద్దలూ నడుములు బిగించి ఏవో ప్రయత్నాలు చేశారుగానీ ఏవీ ఫలించలేదు. ప్రజలకి జడిసి తల్లీతండ్రీ ఎంతగానో నచ్చచెప్పబోతున్నా మొగుడి తాపులకి జడిసి అమ్మాణీ కాపురానికి రావడానికి ససేమిరా ఒప్పుకోవడంలేదు.
ఇటువంటి పరిస్థితిలో భుజంగానికి విశాఖపట్నం ట్రాన్స్ఫరొచ్చింది. ఇదీ తన మంచికే వచినట్టు ఫీలై జాయినింగు టైము కూడా వాడుకోకుండా డ్యుటీలో చేరిపోయాడు. అదృష్టశావత్తూ ఆఫీసుకు దగ్గరలోనే మకాంకి గది దొరికింది.
ఆ గది కుదుర్చుకోడానికి వెళ్ళినప్పుడు, అతను భార్యా సమేతంగా దిగబోతాడనుకొని ఇది ఒంటి ప్రాణికేగానీ జంటకు చాలదు నాయనా అని నవ్విందా ఇంటావిడ.
ఆమె పేరు వరలక్ష్మి. ఆవిడ మాటకి తను కూడా నవ్వుతూ నేను ఒంటి ప్రాణినేనండీ అనేశాడు భుజంగం. ఓ క్షణం అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూసి “నీకింకా పెళ్ళికాలేదా నాయనా?” అనడిగిందావిడ. సమాధానం చెప్పడానికి నోరు పెగలక, ఏం చెప్పాలో తొచక తల అడ్డంగా ఆడించి ఊరుకున్నాడు తను.
అప్పట్నుంచీ ఏదైనా సంధర్భం వచ్చినప్పుడల్లా- “తల నెరిసిపోతేనేగానీ పెళ్ళి చేసుకోవేమిటయ్యా పంతులూ?” అని పరిహాసం చేస్తుంటుందావిడ. దానికింకేం మాట్లాడలేక ఆ టాపిక్ మార్చేయడానికి మరో సంగతేదో ఎత్తుకుంటాడు భుజంగం.
తన పనేమిటో తన లోకమేమిటో తనదేగాని, ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని అధికంగా మాట్లాడే స్వభావం కాదు వరలక్ష్మిది. భగవంతుడు తమకి కలిగిస్తున్న దాంట్లో ఎదుటివాళ్ళకి చేతనైనంత సాయం చేద్దామనుకునే మనిషామె.
ఆవిడ మొగుడు వెల్డరు స్వంతంగా చిన్న వర్క్ షాప్ పెట్టుకున్నాడు. రాబడి బావుంది. తను అట్టే చదువుకోలేదు గనుక, తన ముగ్గురు కొడుకుల్నీ బాగా చదివించి పైకి తీసుకురావాలని అతని సంకల్పం. పిల్లలు కూడా తెలివైన వాళ్ళే పెద్దవాడు నైంత్ క్లాసు చదువుతున్నాడు. రెండోవాదు ఆరవ తరగతిలోకొచ్చాడు. ఆఖరువాడు రెండో తరగతి ఆ ముగ్గురి పిల్లలకీ భుజంగమంటే ఎంతో ఇష్టం. అంకుల్ అంకుల్ అంటూ ఎంతో అభిమానంగా తిరుగుతారు. ఆఫీసునుంచి వచ్చాక మళ్ళీ బయటకు వెళ్ళే పనుండదు భుజంగానికి. వీధిలోకి వెడితే ఏదొక లేనిపోని ఖర్చూ, కాళ్ళపీకుడూ అన్న ధోరణిలో ఆలోచిస్తాడు. అందుకని, సాయంత్రం పూటంతా ఆ కుర్రాళ్ళతోనే కాలక్షేపం చేసేస్తుంటాడు. ఇక భోజనానిక్కూడా ఎక్కడికీ వెళ్ళాల్సిన పన్లేదు. స్వయంపాకమే! కూర రెండు పూటలకీ కలిపి ఉదయమే తయారు చేసేస్తాడు. సాయంత్రం రావడంతోనే కాసిన్ని బియ్యం కడిగి స్టౌ మీద పడేస్తే పదినిముషాల్లో అన్నమైపోతుంది. ఇంక పనేముంటుంది?
“ఎలాగూ స్టౌ ముట్టిస్తావు గనుక సాయంత్రానికి వేరే ఇంత కూరేదో వండి పడేసుకుంటే వేడివేడిగా తినొచ్చు కదయ్యా పంతులూ?” అని, రెండు మూడు సార్లు పెద్దమనిషి తరహాగా సలహా ఇచ్చింది వరలక్ష్మి. దానికతను వినీ విననట్టూరుకోవడంతో మైంకా మాటెత్తడం మానేసిందామె. అయితే-
కూరా నారా లేకుండా ఏ మజ్జిగతోనో అతను కాలక్షేపం చేసేస్తున్నాడని అనుమానం కలిగినప్పుడల్లా తను వండిన దానిలో ఓ గిన్నెడు కూర తీసి పిల్లలతో పంపిచడమో స్వయంగా తనే తీసుకెళ్ళి అందివ్వడమో చేస్తుంటుంది. ఇదంతా అతని ఒంటరి జీవితం పట్ల సానుభూతేగాని లోపల మరో ఉద్దేశ్యం ఉండిగాదు.
Pages: 1 2 3 4 5

Share